సౌక్ అల్ హరాజ్లో షాప్లకు జరీమానా
- April 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, సౌక్ అల్ హరాజ్లోని షాప్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. దోహాలోని నజ్మా ఏరియాలో ఉన్న ఈ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి జరీమానాలు విధించడం జరిగిందని అధికారులు తెలిపారు. మార్కెట్స్ మరియు కమర్షియల్ యాక్టివిటీస్లో ధరల మానిప్యులేషన్స్ని ఉల్లంఘనల్ని తగ్గించడానికి ఇలాంటి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 11 షాపులకు ధరల పట్టీని ప్రదర్శించకపోవడంపై జరీమానా విధించారు. ఒక్కో ఉల్లంఘనకు 6,000 ఖతారీ రియాల్స్ చొప్పున జరీమానా విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉల్లంఘనల్ని సహించబోమని మినిస్ట్రీ ఈ సందర్భంగా హెచ్చరించింది. వినియోగదారులు ఎవరైనా ఉల్లంఘనల్ని గుర్తిస్తే వెంటనే హాట్లైన్స్ ద్వారా సమాచారం అందింవచ్చునని మినిస్ట్రీ సూచించింది. ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఎంఇసి మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







