షార్జా లో ఎత్తైన భవనం నుంచి కింద పడీ మరణించిన 30 ఏళ్ళ వ్యక్తి
- April 28, 2017
షార్జా: నిర్మాణ దశలో ఉన్న 20 అంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకి ఓ ముప్పయేళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. షార్జా ఆల్ మజాజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసు అధికారి "మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తమ దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. అత్యవసర అధికారులకు సమాచారం తెల్సుకొని ఘటనా స్థలంకు వెళ్లారు. ఆ వ్యక్తి సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని షార్జా పోలీసులు ధృవీకరించారు. 20 అంతస్థుల ఎత్తయిన భవనం నుంచి అనూహ్యంగా మరణించాడు.ప్రమాదం గురించి పోలీసులకు తెల్సిన వెంటనే, క్రిమినల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) బృందం ఆ సన్నివేశానికి పంపబడింది. మృతదేహాన్ని గురువారం ఉదయం 6 గంటలకు అల్ కువైట్ ఆసుపత్రికి బదిలీ చేసారు, అప్పటికి మృతదేహం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. మరణించిన వ్యక్తి మరణం మిస్టరీ ఇంకా తెలియాల్సి ఉంది..అది ఆత్మహత్య లేక హత్య అనే విషయం విచారణలో ఇంకా తెలియాల్సిఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







