అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినవారికి చేయూత
- April 29, 2017
వంద మందికి పైగా కార్మికులు, తాము నివాసం ఉంటోన్న క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయారు. బట్టలు, తమకు సంబంధించిన వస్తువులు, డబ్బులు సైతం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. మొత్తం 160 మంది కార్మికులు ఈ అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ వారందరినీ వారి సన్నిహితులు ఆదుకున్నారు. తాము నివాసం ఉంటోన్న చోట వారికి ఆశ్రయం కూఆ కల్పించారు. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, ప్రమాదం గుర్తించిన వెంటనే అందరం అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నామని పాకిస్తానీ కార్మికుడైన మొహమ్మద్ మసూద్ చెప్పారు. ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బాధితులకు తగిన సహాయం అందజేస్తామని వారు పనిచేస్తోన్న సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









