సూపర్‌ మార్కెట్‌ ఓనర్‌ హత్యకేసులో ఇద్దరిపై విచారణ

- April 29, 2017 , by Maagulf
సూపర్‌ మార్కెట్‌ ఓనర్‌ హత్యకేసులో ఇద్దరిపై విచారణ

ఇద్దరు పాకిస్తానీ జీతీయులపై, సూపర్‌ మార్కెట్‌ ఓనర్‌ని హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. షార్జా కోర్ట్‌, ఈ మేరకు 'ప్రీమెడిటేటెడ్‌' మర్డర్‌ ఛార్జ్స్‌ని నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్‌లో నిందితులు, షార్జాలోని మైసెలూన్‌ ఏరియాకివెళ్ళి అక్కడే ఉన్న ఓ షాప్‌లో దొంగతనానికి యత్నించారు. అయితే అక్కడ షాప్‌ ఓనర్‌ వీరి దొంగతనాన్ని ప్రతిఘటించారు. ఈ క్రమంలో అతన్ని నిందితులు హతమార్చారు. పోలీసు విచారణలో నిందితులు, తమ నేరాననిష్ట్ర్న అంగీకరించారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం నిందితులు మాటమార్చడం జరిగింది. అతన్ని చంపాలనే ఉద్దేశ్యం తమకు లేదనీ, దొంగతనం చేసే క్రమంలో కత్తితో దాడి చేశామని వారు న్యాయస్థానానికి వివరించారు. కేసు విచారణ మే 22కి వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com