పూర్తిగా పండని మామిడి పండును తింటే
- April 29, 2017
పూర్తిగా పండని మామిడి పండును తినటంవల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినటం వల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలను రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది.
పండిన మామిడి పండు రసాన్ని ఒక గ్లాసుడు పాలల్లో వేసి, రోజుకు మూడుసార్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ నెల రోజులపాటు తీసుకోవటంవల్ల.. వయసుకు తగినంత బరువులేనివారు క్రమంగా బరువు పెరుగుతారు. దీంతోపాటు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.
తాజా మామిడి ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ప్రతిరోజూ తాగటంవల్ల డయాబెటీస్ (చక్కెర వ్యాధి)ని అరికట్టవచ్చు. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ మామిడి ఆకులను నానబెట్టిన నీటితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కళంగా లబిస్తుంది. దీనివల్ల జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







