భారత్- బ్రిటన్ హాకీ మ్యాచ్ డ్రా
- April 29, 2017
ప్రతిష్టాత్మకమైన ఆజ్లాన్ షా హాకీ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్లో భారత్ డ్రాతో గట్టెక్కింది. శనివారం బ్రిటన్తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. తొలుత మ్యాచ్ పట్టు బిగించిన భారత ఢిపెండర్లు నాలుగో క్వార్టర్లో అదే జోరు కొనసాగించలేకపోవడంతో చివరి నిమిషంలో ఫెనాల్టీ కార్నర్తో ఓటమి నుంచి గట్టెక్కింది. 19 నిమిషంలో ఆకాశ్ దీప్ ఫెనాల్టీని గోల్గా మలచి భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. 25వ నిమిషంలో కార్లసన్ బ్రిటన్ తరపును గోల్ చేసి 1-1తో స్కోర్లను సమం చేశాడు. మళ్లీ 48 నిమిషంలో మణిదీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి బ్రిటన్పై భారత్కు 2-1 ఆధిక్యం సాధించాడు. అయితే భారత్ను నిలువరించి బ్రిటన్ మళ్లీ పుంజుకుని 52 నిమిషంలో అలెన్ గోల్ చేసి 2-2తో సమం చేశాడు. అయితే చివరి నిమిషంలో బ్రిటన్ ఫెనాల్టీని భారత్ నిర్వీర్యం చేయడంతో డ్రాతో గట్టెక్కింది. ఎనిమిది రోజుల పాటు ఈ సాగే టోర్నీలో భారత్తో పాటు బ్రిటన్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర ఐదు దేశాలో బరిలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో సాగే ఈ టోర్నీలో పాయింట్లు ఆధారం ఫైనల్కు జట్లు చేరుకుంటాయి.
ఈ ఏడాది పాకిస్తాన్ టోర్నీలో పాల్గొనలేదు. గతేడాది తొమ్మిదేళ్ల ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత్ రన్నరప్ సాధించింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









