భారత్- బ్రిటన్ హాకీ మ్యాచ్ డ్రా
- April 29, 2017
ప్రతిష్టాత్మకమైన ఆజ్లాన్ షా హాకీ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్లో భారత్ డ్రాతో గట్టెక్కింది. శనివారం బ్రిటన్తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. తొలుత మ్యాచ్ పట్టు బిగించిన భారత ఢిపెండర్లు నాలుగో క్వార్టర్లో అదే జోరు కొనసాగించలేకపోవడంతో చివరి నిమిషంలో ఫెనాల్టీ కార్నర్తో ఓటమి నుంచి గట్టెక్కింది. 19 నిమిషంలో ఆకాశ్ దీప్ ఫెనాల్టీని గోల్గా మలచి భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. 25వ నిమిషంలో కార్లసన్ బ్రిటన్ తరపును గోల్ చేసి 1-1తో స్కోర్లను సమం చేశాడు. మళ్లీ 48 నిమిషంలో మణిదీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి బ్రిటన్పై భారత్కు 2-1 ఆధిక్యం సాధించాడు. అయితే భారత్ను నిలువరించి బ్రిటన్ మళ్లీ పుంజుకుని 52 నిమిషంలో అలెన్ గోల్ చేసి 2-2తో సమం చేశాడు. అయితే చివరి నిమిషంలో బ్రిటన్ ఫెనాల్టీని భారత్ నిర్వీర్యం చేయడంతో డ్రాతో గట్టెక్కింది. ఎనిమిది రోజుల పాటు ఈ సాగే టోర్నీలో భారత్తో పాటు బ్రిటన్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర ఐదు దేశాలో బరిలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో సాగే ఈ టోర్నీలో పాయింట్లు ఆధారం ఫైనల్కు జట్లు చేరుకుంటాయి.
ఈ ఏడాది పాకిస్తాన్ టోర్నీలో పాల్గొనలేదు. గతేడాది తొమ్మిదేళ్ల ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత్ రన్నరప్ సాధించింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









