ఫేక్ వీసా: వలసదారుడికి మూడేళ్ళ జైలు
- May 06, 2017
దోహా: దోహా క్రిమినల్ కోర్ట్ నేపాలీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష, ఆ తర్వాత డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 33 బిజినెస్ వీసాలు, అలాగే ఎంట్రీ వీసాలను అక్రమంగా తయారుచేస్తున్నందుకుగాను నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేయడం, అలాగే తన ఐడీని ఫేక్ వీసాల కోసం వినియోగించి, ఇతరులకు అమ్మినట్లు నేరం నిర్ధారణ అయ్యింది. 200 ఎంట్రీ వీసాల్ని 400,000 ఖతారీ రియాల్స్కి విక్రయించాడు ఏడాదిన్నర కాలంలోనే. కంపెనీకి సంబంధించిన కొన్ని పత్రాల్ని యజమాని రివ్యూ చేస్తున్నప్పుడు ఈ కుట్రకోణం బయటపడింది. యజమాని, నిందితుడి గురించి పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి వివరాలు రాబట్టారు.
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







