టివి లో క్రైమ్ సీరియల్స్ చూసి చంపేశాడు !!
- May 06, 2017
మీ పిల్లలు క్రైమ్ సీరియళ్లు చూస్తున్నారా..? ఎందుకైనా మంచిది కొంచెం ఓ కన్నేయండి.! లేదంటే క్రిమినల్ గా జైళ్లో చూడాల్సిన పరిస్థితి రావొచ్చు. ఓ డిగ్రీ కుర్రాడు..క్రైమ్ సీరియళ్లు చూసి చూసి..క్రిమినల్ గా మారాడు. డబ్బుల కోసం పక్కింటి అబ్బాయిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మునీర్.. చదివేది బీకాం ఫస్టియర్ కానీ.. బుర్రనిండా అన్నీ క్రైమ్ ఆలోచనలు. స్మార్ట్ ఫోన్లో నిత్యం క్రైమ్ సీరియళ్లు చూసీ చూసి..క్రిమినల్ గా మారాలని కలలు కన్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పులు కూడా చేశాడు. అప్పులు తీర్చేందుకు ఏదో ఒక నేరం చేయాలని డిసైడయ్యాడు. కానీ ఎవర్ని కిడ్నాప్ చేయాలి..? ఇలా రెండుమూడ్రోజులు ఆలోచించాడు.
హైద్రాబాద్ బండ్లగూడలోని జహంగీరాబాద్లో ఉంటున్న మునీర్..తమ ఇంటి పక్కనే ఉండే పిల్లాడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ వేశాడు. పన్నెండేళ్ల ఉరూజుద్దీన్ అహ్మద్..రోజూ సాయంత్రం అరబిక్ నేర్చుకునేందుకు వెళ్తున్నాడని గమనించాడు. ఏప్రిల్ 28న బైకుపై సరదాగా తిప్పుతానని నమ్మించి జహంగీరాబాద్లోని కుంట వద్దకు తీసుకెళ్లాడు. కిడ్నాపైతే చేశాడు కానీ..బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్
చేసేందుకు ధైర్యం సరిపోలేదు. భయమేసి చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నాడు. కానీ..ఈ విషయం బయటకు తెలిసినా..కుర్రాడు ఇంటికెళ్లినా.. పోలీసులకు తెలుస్తుందని.. పరువు పోతుందని గొంతు నులిమి చంపేశాడు. ఆతర్వాత బట్టులు తీసి తగులబెట్టాడు. శవాన్ని చెరువులో పడేశాడు. పన్నెండేళ్ల అహ్మద్ ను హత్యచేసిన మునీరుద్దీన్ అదేరోజు ఏప్రిల్ 28న ముంబై వెళ్లాడు. ఐదురోజులు అక్కడే తిరిగి ఏమితెలియనట్టు బుధవారం సీటికొచ్చాడు. తాను మర్డర్ చేసినట్టు ఆధారాలు లేవని ధైర్యంతో హైద్రాబాద్ వచ్చాడు. బట్..అప్పటికే పోలీసులు సీసీ ఫూటేజ్ వివరాలు సేకరించారు. మునీర్ కూడా అజ్ఞాతంలో ఉండటంతో నేరం చేసింది అతనేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుడు మునీర్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. అహ్మద్ ను కిడ్నాప్ చేసి..డబ్బులు డిమాండ్ చేసే ధైర్యలేక హతమార్చినట్టు అంగీకరించాడు. బుద్ధిగా చదువుకోకుండా క్రైమ్ సీయళ్లకు ఎడిక్ట్ అయినా మునీర్..చివరకు నేరస్తుడిగా మారిపోయాడు. వ్యవసాలకు అలవాటు పడి పాపం ముక్కుపచ్చలారని బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. చివరకు కటకటాలపాలై భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







