50 మంది అఫ్గాన్ సైనికులను హతమార్చిన పాక్ సైన్యం
- May 07, 2017
అఫ్గానిస్థాన్కు చెందిన 50 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం ఆదివారం వెల్లడించింది. సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో పది మంది పాక్ పౌరులు మృతిచెందారు. అప్పటినుంచీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని తమ దేశ పౌరులపై శుక్రవారం అఫ్గాన్ బలగాలు జరిపిన కాల్పులను తాము తిప్పికొట్టామని పాక్ మేజర్ జనరల్ నదీం అహ్మద్ తెలిపారు. దాడుల్లో వంద మందికిపైగా అఫ్గాన్ సైనికులు గాయాలపాలయ్యారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









