ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన తెలుగోళ్ళు
- May 07, 2017
ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిన వాళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువట. తెలంగాణా నుంచి 25, ఏపీ నుంచి అయిదుగురు.. మొత్తం 30 మంది ట్యాక్స్ డిఫాల్ట ర్స్ ఉన్నారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రిలీజ్ చేసిన డేటా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డిఫాల్టర్స్ అయిన 96 కంపెనీలు, వ్యక్తుల పేర్లను ఈ బోర్డు వెల్లడించింది. వీళ్ళంతా మొత్తం 1,046 కోట్ల పన్నులను చెల్లించాల్సి ఉంది. టాప్ ఫైవ్ లిస్టులో టోటేమ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ 401.64 కోట్లు, రాయల్ ఫ్యాబ్రిక్స్ 158.94 కోట్లు, నెక్సో ఫిట్ ఇన్ ఫో టెల్ 68.21 కోట్లు, కృషి వెంకటేశ్వర రావు 49.2 కోట్లు, జేనేక్స్ టెక్నాలజీస్ సంస్థ 47.04 కోట్లు చెల్లించాల్సి ఉందని ఈ డేటా పేర్కొంది.
పన్ను చెల్లించని వారిని అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని, ఇందుకు ఆదాయపు పన్ను చట్టం లోని 276 సీ (2) సెక్షన్ కింద గల నిబంధనలను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటివారికి 3 నెలల నుంచి మూడేళ్ళ వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ పేరిట ఓ అధికారికి ఇందుకు గాను ప్రత్యేక అధికారాలు ఇస్తారు. కాగా పన్ను ఎగ్గొట్టిన కంపెనీలు, వ్యక్తుల లిస్టు ఇలా ఉంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









