కిడ్నీ కొనుగోలు: లాహోర్‌లో ఇద్దరు ఒమన్ల అరెస్ట్‌

- May 08, 2017 , by Maagulf
కిడ్నీ కొనుగోలు: లాహోర్‌లో ఇద్దరు ఒమన్ల అరెస్ట్‌

ఇద్దరు ఒమన్‌ జాతీయుల్ని పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసింది. లాహోర్‌లో కిడ్నీల కొనుగోలుకు యత్నించారనే ఆరోపణల నేపథ్యంలో వీరి అరెస్ట్‌ జరిగింది. మొత్తం ఆరుగురు వ్యక్తులు అరెస్ట్‌ కాగా, అందులో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. అక్రమంగా సర్జరీలు జరుగుతున్న ఓ ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులకు వీరుపట్టుబడ్డారు. ఈ గ్యాంగ్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీల వ్యాపారం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్‌ జామిల్‌ అహ్మద్‌ మాయో మాట్లాడుతూ, ఇద్దరు ఒమన్‌ జాతీయులకు అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తుండగా నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సుమారుగా 25,703 ఒమన్‌ రియాల్స్‌ని ఒక్కో కిడ్నీ కోసం ఇద్దరు ఒమనీయులు చెల్లించినట్లుగా విచారణలో పోలీసులు తేల్చారు. ఒమన్‌లో కిడ్నీ డోనర్స్‌ తక్కువగా ఉండటంతో, ఒమనీ కుటుంబాలు తమవారి కోసం ఏజెంట్లను వివిధ దేశాల్లో సంప్రదిస్తున్నారు. పాకిస్తాన్‌ చట్టాల ప్రకారం అవయవదానం కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే చేయాలి. ఇతరులకు చేయడం నేరం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com