ఢిల్లీ - దోహా ఇండిగో విమానానికి హెచ్ఐఏ ఘనస్వాగతం
- May 08, 2017
గంగా అభివృద్ధి సాధిస్తున్న ఇండియాకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఇండిగో, దోహాకి తమ సేవల్ని ప్రారంభించింది. ఢిల్లీ - దోహా విమానం 6ఇ1701, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఇండిగోకి సంబంధించినంతవరకు షార్జా, మస్కట్ మరియు దుబాయ్ తర్వాత ఇండిగో నెట్వర్క్లో నాలుగో మిడిల్ ఈస్టర్న్ డెస్టినేషన్ అలాగే, ఏడవ ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా దోహా మారింది. హెచ్ఐఏ వద్ద జరిగిన ఇనాగ్యురల్ సెర్మనీలో, తొలి విమానానికి ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ - దోహా, ముంబై - దోహా మధ్య అందరికీ అందుబాటులో ఉండే ఛార్జీలతో విమాన సర్వీసుల్ని నడుపుతున్నట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఖతార్ ఎకనమిక్ మరియు కల్చరల్ హబ్ కావడంతో దోహా, వ్యాపార వర్గాల్ని విశేషంగా ఆకర్షిస్తోందని చెప్పారు. టూరిజం పరంగానూ దోహా ఎంతో ప్రత్యేకతను చాటుకుందన్నారు. తద్వారా ప్రయాణీకులు దోహా వెళ్ళేందుకు ఎక్కువగా ముందుకొస్తున్నట్లు వివరించారాయన. హెచ్ఐఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బదర్ మొహమ్మద్ అల్ మీర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల సౌకర్యం తమ తొలి ప్రాధాన్యం అని చెప్పారు. ఇండిగో విమానాల చేరికతో, మొత్తం వారానికి 25 విమానాలు ముంబై నుంచి, అలాగే 35 విమానాలు ఢిల్లీకి పయనమవుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి







