శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు: నిషిత్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన
- May 10, 2017
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో నిషిత్ మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో.. తీవ్ర శోకసముద్రంలో మునిగిన నిషిత్ కుటుంబాన్ని బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని అన్నారు. ఎదిగొచ్చిన కుమారుడు దూరమైపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కొడుకును కోల్పోయిన విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అంతకుముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకుని.. ఏర్పాట్లను దగ్గరుండి పరామర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వీరితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.
తాజా వార్తలు
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!







