మొహర్రం తొలి రోజు సెలవు
- October 07, 2015
దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి, సయ్యద్ ఖాలీద్ బిన్ హిలాల్ బిన్ సౌద్ అల్ బుసాది, మొహర్రం తొలి రోజును సెలవు దినంగా ప్రకటించారు. హోలి ప్రొఫెట్స్ హిజ్రా యానివర్సరీ మరియు న్యూ హిజ్రి ఇయర్ 1437 సందర్భంగా ఈ సెలవును ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ శాఖలన్నిటికీ ఈ సెలవు వర్తిస్తుందని, పబ్లిక్ అథారిటీస్ మరియు, వివిధ రంగాల్లో సెలవు పాటించాలని ఆదేశించారాయన. సుల్తాన్ ఖుబూస్ బిన్కి అల్లా సంపూర్ణ ఆరోగ్యం అందించాలనీ, ఆయన మంచి పరిపాలన అందించేలా అల్లా దీవించాలని సందర్భంగా సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ ఆకాంక్షించారు. మానవ వనరుల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ బక్రి, సెలువు దినాన్ని ప్రకటిస్తూ, అధికారికంగా సెలవు దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులు, కార్మికులు, ప్రైవేటు రంగంలోని కార్మికులు, ఉద్యోగులకు సెలవు దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







