పీవీ సింధు, ఇండోనేషియాపై ఇరగదీసింది
- May 23, 2017
- 4-1తో భారత్ ఘన విజయం
- సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్
సుదిర్మన్ కప్లో టీమ్ ఇండియా గొప్పగా పుంజుకున్నది. డెన్మార్క్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడినా, మాజీ చాంపియన్ ఇండోనేషియాపై మెరుపు విజయంతో రేసులో నిలిచింది. స్టార్ షట్లర్ పి.వి సింధు మరోసారి జట్టును ముందుండి నడిపించటంతో భారత్ 4-1తో ఇండోనేషియాపై ఘన విజయం సాధించింది. నేడు డెన్మార్క్, ఇండోనేషియా పోరులో డెన్మార్క్ నెగ్గితే గ్రూప్1డి నుంచి భారత్, డెన్మార్క్లు క్వార్టర్స్కు చేరుకుంటాయి. ఇండోనేషియా నెగ్గితే మాత్రం గేమ్ రికార్డు ప్రకారం మెరుగైన జట్టు క్వార్టర్స్కు చేరుకుంటుంది. మిక్స్డ్ డబుల్స్తో మొదలెట్టిన భారత్, మహిళల డబుల్స్తో మ్యాచ్ను ముగించింది. సాత్విక్ సాయి రెడ్డి, అశ్విని పొన్నప్పలు 22-20, 17-21, 21-19తో గెలుపొందారు. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 2116తో జొనాథన్ క్రిస్టెపై వరుస గేముల్లో గెలుపొందాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 9-21, 17-21తో పోరాడి ఓడింది.
ఇక మహిళల సింగిల్స్లో పి.వి సింధు 21-8, 21-18తో ఫిట్రానిపై ఏకపక్ష విజయం నమోదు చేయగా 3-1తో అప్పటికే భారత్ గెలుపు ఖాయం చేసుకున్నది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 21-12, 21-19తో గెలుపొంది భారత్ ఆధిక్యాన్ని 4-1కు తీసుకెళ్లారు. సుదిర్మన్ టీమ్ చాంపియన్షిప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే క్వార్టర్స్కు చేరుకున్నది. గత రెండు సీజన్లుగా టీమ్ ఇండియా గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తోంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









