ధరల పెరుగుదలపై అజ్మన్ వార్నింగ్
- May 25, 2017
అజ్మన్లో ఫుడ్ ఔట్లెట్స్, సూపర్ మార్కెట్ ఛెయిన్స్లకు అజ్మన్ అధికారులు ధరల పెరుగుదలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ&్చరించారు అధికారులు. అజ్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ - కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అండ్ మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్, తాజాగా స్థానిక సూపర్మార్కెట్స్ ఛెయిన్ ప్రతినిథులతో సమావేశమయి, గైడ్ లైన్స్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టు నడుచుకుంటామని అన్ని వర్గాలూ ఓ అవగాహనకు వచ్చాయి. ఎడిఇడి కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మొహమ్మద్ అల్కుత్బి మాట్లాడుతూ, స్థిరమైన ధరలతో రమదాన్ మాసంలో సామాన్యులకు హ్యాపీనెస్ని అందించాలనీ, ధరలను ఇష్టమొచ్చినట్లుగా పెంచి ఇబ్బందులకు గురిచేయరాదని ఆయా సంస్థల ప్రతినిథులకు సూచించారు. తమ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుందనీ, తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







