ధరల పెరుగుదలపై అజ్మన్ వార్నింగ్
- May 25, 2017
అజ్మన్లో ఫుడ్ ఔట్లెట్స్, సూపర్ మార్కెట్ ఛెయిన్స్లకు అజ్మన్ అధికారులు ధరల పెరుగుదలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ&్చరించారు అధికారులు. అజ్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ - కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అండ్ మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్, తాజాగా స్థానిక సూపర్మార్కెట్స్ ఛెయిన్ ప్రతినిథులతో సమావేశమయి, గైడ్ లైన్స్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టు నడుచుకుంటామని అన్ని వర్గాలూ ఓ అవగాహనకు వచ్చాయి. ఎడిఇడి కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మొహమ్మద్ అల్కుత్బి మాట్లాడుతూ, స్థిరమైన ధరలతో రమదాన్ మాసంలో సామాన్యులకు హ్యాపీనెస్ని అందించాలనీ, ధరలను ఇష్టమొచ్చినట్లుగా పెంచి ఇబ్బందులకు గురిచేయరాదని ఆయా సంస్థల ప్రతినిథులకు సూచించారు. తమ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుందనీ, తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









