ధరల పెరుగుదలపై అజ్మన్ వార్నింగ్
- May 25, 2017
అజ్మన్లో ఫుడ్ ఔట్లెట్స్, సూపర్ మార్కెట్ ఛెయిన్స్లకు అజ్మన్ అధికారులు ధరల పెరుగుదలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ&్చరించారు అధికారులు. అజ్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ - కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అండ్ మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్, తాజాగా స్థానిక సూపర్మార్కెట్స్ ఛెయిన్ ప్రతినిథులతో సమావేశమయి, గైడ్ లైన్స్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టు నడుచుకుంటామని అన్ని వర్గాలూ ఓ అవగాహనకు వచ్చాయి. ఎడిఇడి కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మొహమ్మద్ అల్కుత్బి మాట్లాడుతూ, స్థిరమైన ధరలతో రమదాన్ మాసంలో సామాన్యులకు హ్యాపీనెస్ని అందించాలనీ, ధరలను ఇష్టమొచ్చినట్లుగా పెంచి ఇబ్బందులకు గురిచేయరాదని ఆయా సంస్థల ప్రతినిథులకు సూచించారు. తమ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుందనీ, తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









