ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో 'మా ఊరి ప్రేమకథ' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో
- June 03, 2017
మంజునాథ్ హీరోగా 'శరణం గచ్ఛామి' ఫేమ్ తనిష్క తివారి హీరోయిన్గా శ్రీమల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'మా ఊరి ప్రేమకథ'. విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.
హీరో కమ్ ప్రొడ్యూసర్ మంజునాథ్ మాట్లాడుతూ - ''రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం. టైటిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్ని ఆట్టుకుంటుంది. టెక్నికల్గా పెద్ద చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా రూపొందించాం. హీరోగా ఈ చిత్రం నాకు చాలా మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్గా వున్నాను. హీరోయిన్ తనిష్క తివారి చాలా బాగా నటించింది. చిత్రంలో ఐదు పాటలున్నాయి. జయసూర్య ఈ చిత్రానికి సూపర్ మ్యూజిక్నిచ్చారు. అద్భుతమైన లొకేషన్లలో సాంగ్స్ను షూట్ చేశాం. విజువల్గా కూడా చాలా బాగా వచ్చాయి. ఈ నెలలో ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసి, జూలైలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
మంజునాథ్, తనిష్క తివారి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, కెమెరా: కళ్యాణ్ సమి, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, డ్యాన్స్: కిరణ్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ మేనేజర్: వెంకటేష్, నిర్మాత: మంజునాథ్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్.వి.ఎమ్.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









