అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 12మంది మృతి

- June 03, 2017 , by Maagulf
అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 12మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో మళ్లీ రక్తపాతం జరిగింది. ఖేర్‌ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా.. వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 12 మంది వరకూ చనిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఇటీవల అఫ్గాన్‌లోని కాబూల్‌లో దౌత్యకార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 80 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు నిరసనగా.. శుక్రవారం కాబూల్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో సెనేటర్‌ ఎజద్యార్‌ కుమారుడు మృతిచెందాడు. శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com