అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 12మంది మృతి
- June 03, 2017
అఫ్గానిస్థాన్లో మళ్లీ రక్తపాతం జరిగింది. ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా.. వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 12 మంది వరకూ చనిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఇటీవల అఫ్గాన్లోని కాబూల్లో దౌత్యకార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 80 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు నిరసనగా.. శుక్రవారం కాబూల్లో భారీ ర్యాలీ చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో సెనేటర్ ఎజద్యార్ కుమారుడు మృతిచెందాడు. శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి.
తాజా వార్తలు
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..









