ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఉగ్రబాంబు దాడి కలకలం, 200 మందికి గాయాలు
- June 04, 2017
ఇటలీలోని ట్యూరిన్లో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫుట్బాల్ ప్రేమికులు స్టేడియం వద్దకు వచ్చారు.
ఈలోగా స్టేడియంలో బాంబు పేలిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు పారిపోయారు. కిందపడ్డ వారిని అలాగే తొక్కుకుంటూ వెళ్లారు.
దీంతో దాదాపు 200 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ హానీ జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మరో పది నిమిషాల్లో మ్యాచ్ పూర్తవుతుందనగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్
అప్పుడు టపాసులు పేలాయి. అవి బాంబుల పేలుడు శబ్దాలని కొందరు ప్రేక్షకులు పెద్దగా అరవడంతో మిగతా ప్రేక్షకులు కంగారు పడి పరుగెత్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







