జీవితం విలువ తెలిసిందంటున్న మనీషా కొయిరాల
- June 04, 2017
జీవిత విలువ ఏమిటో తెలిసిందని అంటోంది ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాల. ఢిల్లీలో స్పెషల్ ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్ అవార్డు కూడా అందుకున్న ఆమె.. క్రైసిస్ (కష్టాలు) అన్నది జీవిత విలువను కూడా చాటి చెప్పిందని పేర్కొంది. ఈ అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
2012లో గర్భాశయ క్యాన్సర్కు గురైన మనీషా న్యూయార్క్లోని ఆసుపత్రిలో చాలాకాలం పాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలైంది. ప్రమాదకరమైన క్యాన్సర్ను జయించిన నటిగా రికార్డు సృష్టించింది. ఒక క్యాన్సర్ పేషంటుగా ఉన్న తాను దీన్ని ఎలా జయించానో, ప్రజల్లో అవగాహన కలిగిస్తానని మనీషా కొయిరాల గతంలోనే ప్రకటించింది. క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నట్టు ఆమె తెలిపింది. మనీషా ఇటీవలే నటించిన డియర్ మాయ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









