జీవితం విలువ తెలిసిందంటున్న మనీషా కొయిరాల
- June 04, 2017
జీవిత విలువ ఏమిటో తెలిసిందని అంటోంది ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాల. ఢిల్లీలో స్పెషల్ ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్ అవార్డు కూడా అందుకున్న ఆమె.. క్రైసిస్ (కష్టాలు) అన్నది జీవిత విలువను కూడా చాటి చెప్పిందని పేర్కొంది. ఈ అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
2012లో గర్భాశయ క్యాన్సర్కు గురైన మనీషా న్యూయార్క్లోని ఆసుపత్రిలో చాలాకాలం పాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలైంది. ప్రమాదకరమైన క్యాన్సర్ను జయించిన నటిగా రికార్డు సృష్టించింది. ఒక క్యాన్సర్ పేషంటుగా ఉన్న తాను దీన్ని ఎలా జయించానో, ప్రజల్లో అవగాహన కలిగిస్తానని మనీషా కొయిరాల గతంలోనే ప్రకటించింది. క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నట్టు ఆమె తెలిపింది. మనీషా ఇటీవలే నటించిన డియర్ మాయ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









