జీవితం విలువ తెలిసిందంటున్న మనీషా కొయిరాల
- June 04, 2017
జీవిత విలువ ఏమిటో తెలిసిందని అంటోంది ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాల. ఢిల్లీలో స్పెషల్ ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్ అవార్డు కూడా అందుకున్న ఆమె.. క్రైసిస్ (కష్టాలు) అన్నది జీవిత విలువను కూడా చాటి చెప్పిందని పేర్కొంది. ఈ అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
2012లో గర్భాశయ క్యాన్సర్కు గురైన మనీషా న్యూయార్క్లోని ఆసుపత్రిలో చాలాకాలం పాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలైంది. ప్రమాదకరమైన క్యాన్సర్ను జయించిన నటిగా రికార్డు సృష్టించింది. ఒక క్యాన్సర్ పేషంటుగా ఉన్న తాను దీన్ని ఎలా జయించానో, ప్రజల్లో అవగాహన కలిగిస్తానని మనీషా కొయిరాల గతంలోనే ప్రకటించింది. క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నట్టు ఆమె తెలిపింది. మనీషా ఇటీవలే నటించిన డియర్ మాయ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







