కెమెరాలతో మెరుగైన ట్రాఫిక్
- October 10, 2015
అల్ షమాల్ ఎక్స్ప్రెస్ వే మీద ప్రయాణించేవారు, ఎంతో క్రమశిక్షణతో తమ వాహనాల్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా అమర్చిన కెమెరా వ్యవస్థ సమర్థవంతగా పనిచేస్తోదని, వాహనదారులు ఈ కెమెరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 'తలా' ప్రాజెక్ట్లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది. అతి వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ ట్రాక్ డ్రైవింగ్, రైట్ సైడ్ ఓవర్ టేకింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు కెమెరాలు ఏర్పాటు చేశాక బాగా తగ్గాయి. వాహనదారులు క్రమశిక్షణతో వాహనాల్ని నడిపితే ప్రమాదాలు తగ్గుతాయనీ, ప్రమాదాల నివారణ కోసమే కెమెరాలు ఏర్పాటు చేశామనీ, తమ ప్రయోగం సక్సెస్ అవడం ఆనందాన్నిస్తుందని అధికారులు వివరించారు. పూర్తిగా ఉల్లంఘనలు తగ్గిపోనప్పటికీ, చాలావరకు తగ్గడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వాహనదారులు కూడా కెమెరాల ఏర్పాటు తర్వాత రోడ్లపై ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. వాహనాలన్నీ క్రమశిక్షణతో వెళ్తున్నట్లు, ప్రభుత్వం చర్యలు సమర్థనీయమని అన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







