కెమెరాలతో మెరుగైన ట్రాఫిక్
- October 10, 2015
అల్ షమాల్ ఎక్స్ప్రెస్ వే మీద ప్రయాణించేవారు, ఎంతో క్రమశిక్షణతో తమ వాహనాల్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా అమర్చిన కెమెరా వ్యవస్థ సమర్థవంతగా పనిచేస్తోదని, వాహనదారులు ఈ కెమెరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 'తలా' ప్రాజెక్ట్లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది. అతి వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ ట్రాక్ డ్రైవింగ్, రైట్ సైడ్ ఓవర్ టేకింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు కెమెరాలు ఏర్పాటు చేశాక బాగా తగ్గాయి. వాహనదారులు క్రమశిక్షణతో వాహనాల్ని నడిపితే ప్రమాదాలు తగ్గుతాయనీ, ప్రమాదాల నివారణ కోసమే కెమెరాలు ఏర్పాటు చేశామనీ, తమ ప్రయోగం సక్సెస్ అవడం ఆనందాన్నిస్తుందని అధికారులు వివరించారు. పూర్తిగా ఉల్లంఘనలు తగ్గిపోనప్పటికీ, చాలావరకు తగ్గడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వాహనదారులు కూడా కెమెరాల ఏర్పాటు తర్వాత రోడ్లపై ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. వాహనాలన్నీ క్రమశిక్షణతో వెళ్తున్నట్లు, ప్రభుత్వం చర్యలు సమర్థనీయమని అన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









