వ్యక్తిగత 'ఎన్ఓఎల్' కార్డుల జారీ
- October 10, 2015
దుబాయ్ రోడ్లు మరియు రవాణా శాఖ (ఆర్టిఏ) ఎన్ఓఎల్ ఎక్స్ప్రెస్ అనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్టాండర్డ్ మరియు గోల్డ్ క్లాస్ ప్యాసింజర్ల కోసం ఈ కార్డులను జారీ చేస్తోంది. ఎమిరేట్ ఐడితో ఈ కార్డుల్ని వినియోగించడం ఎంతో తేలిక. మెట్రో స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణీకులు తమ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఈ స్మార్ట్ కార్డ్ల్ని తీసుకొచ్చామనీ, భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడ్తామని ఆర్టిఏ అధికారులు వెల్లడించారు. జూమ్ మరియు మెట్రో ఔట్లెట్స్లో ఈ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్డ్ ప్రోసెస్లో భాగస్వామి అయిన ఇనాక్ సంస్థకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కార్డులు, అందులోనూ వ్యక్తిగతంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం కార్డుల్ని జారీ చేయడం ఇదే ప్రధమమని భావిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







