సౌదీ రాజుకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫోన్
- June 07, 2017
ఖతార్లో గల్ఫ్ దేశాలు సంబంధాలను తెంచుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సౌదీ రాజు సల్మాన్ అమిద్కు ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరుకు గల్ఫ్ దేశాలు ఐక్యమవాలని ఆయన కోరారు. ఉగ్రవాద సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయడం తదితర కీలకమైన విషయాల గురించి ఇరు నేతలు చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఖతార్ విషయం తెలిసిన వెంటనే ట్విటర్ ద్వారా స్పందించిన ట్రంప్ ‘నా పశ్చిమాసియా పర్యటన ఫలించింది. అతివాద భావజాలానికి ఏ రకంగాను ఆర్థిక సాయం చేయకూడదని నా పర్యటనలో చెప్పాను, నేతలు ఖతార్ను ఎంచుకున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ఇదే తొలి అడుగు కావచ్చు’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
తీవ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు అండగా నిలుస్తుందని ఖతార్తో సౌదీఅరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు మరికొన్ని దేశాలు సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాలు చేస్తున్న ఆరోపణలను ఖతార్ తీవ్రంగా ఖండిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







