యునెస్కో ప్రచారంలో సచిన్ టెండూల్కర్
- June 08, 2017
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఐక్య రాజ్య సమతి అనుబంధ సంస్థ యునెస్కో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో సచిన్ పాల్గొననున్నాడు. చిన్నారుల మానసిక, శారీరక పెరుగదల్లో తండ్రులుదే కీలక పాత్ర అనే నినాదంతో యునెస్కో నిర్వహించనున్న ప్రచార, అవగాహన ఉద్యమంలో సచిన్ పాల్గొంటున్నాడు. ఈ నెల 18న ఫాదర్స్ డే సందర్భంగా 'సూపర్ డాడ్స్' పేరుతో యునెస్కో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సచిన్తో పాటు ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు డేవిడ్ బెక్హామ్, నోవాక్ జకోవిచ్లు కూడా పాల్గొంటున్నారు. వీరితో పాటు బ్రిటీష్ ఫార్ములా వన్ రేస్ డ్రైవర్ లూయిస్ హమ్లింటన్, అకాడమీ అవార్డు గెలుచుకున్న అమెరికా నటుడు మహేర్షల అలీ, ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్మాన్ పాల్గొంటున్నారు. వీరితో కలిసి ప్రచార కార్యక్రమాన్ని యునెస్కో నిర్వహించనుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ 'నా చిన్నతనంలో నా తండ్రి సరైన ప్రేమను, స్వేచ్ఛను, మద్దతును ఇచ్చారు. వాటి ద్వారానే నేను ప్రస్తుతం ఈ విధంగా రూపుదిద్దుకున్నాను' అని తెలిపారు. తండ్రులతో చిన్నారుల సాన్నిత్యం, ముఖ్యంగా వారి తొలి 1000 రోజుల్లో తండ్రుల సాన్నిత్యం వారిపై ఎంతో ప్రభావం చూపుతుందని యునెస్కో ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









