ఆటా సర్వసభ్య సమావేశం

- June 11, 2017 , by Maagulf
ఆటా సర్వసభ్య సమావేశం

అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సర్వసభ్య సమావేశం.. చికాగో నగరంలోని రినెస్సెన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యవర్గం తమ విధులను నూతన కార్యవర్గానికి అప్పజెప్పింది. ఆటా నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ కందిమళ్ళ.. కొండా రామ్మోహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా కరుణాకర్ అసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నరేంద్ర చీమర్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వినోద్ కుక్కునూరు, సెక్రటరీగా విష్ణు మాధవరం, జాయింట్ సెక్రటరీగా రఘువీర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా మహిధర్ రెడ్డి, ట్రెజరర్ గా ప్రసాద్ చింతలపాని ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరానికి గాను ఆటా సర్వసభ్య సమావేశాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com