సామాజిక మీడియా ఆర్ ఓ పి కు సమర్థవంతమైన సాధనం.
- June 13, 2017
సమస్యలు సృష్టించడం ..వివాదాలు పరిష్కరించడంలో సామాజిక మాధ్యమాలు ఇటీవల ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, రాయల్ ఒమాన్ పోలీస్ సైతం సోషల్ మీడియాను పరిశోధనాత్మక సాధనంగా ఉపయోగిస్తున్నారు. గత ఆదివారం మస్కట్ లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో తన కారుని నిర్లక్ష్యంగా వేగంగా నడిపిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాలో ప్రసారం కాబడిన ఒక వీడియో ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ధృవీకరించింది. " ఆ డ్రైవర్ కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ చెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ఆధారంగా చర్య తీసుకున్న తీరు ఇదే మొదటిసారి కాదు. గత నెలలోను , మరొక కారు డ్రైవర్ వరదలు ప్రవహిస్తున్న రహదారి పై కారుని నడుపుతూ సైకిలు తొక్కుతున్న వ్యక్తిపై నీళ్లు చిమ్ముకొంటు వెళ్లిన కారణంగా అరెస్టు చేశారు. పౌరులు అనేకమంది పోస్ట్ కాబడిన ఆ వీడియో పట్ల గట్టిగా ప్రతిస్పందించారు. ఒమాని సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిర్లక్ష్యంపై స్పందించిన పోలీసులు కారు డ్రైవర్ పై చర్య తీసుకున్నారు. వాహన డ్రైవర్ తన కారుని వేగవంతంగా నడుపుతున్నప్పుడు ఆ సైక్లిస్ట్ సమీపంలోనే ఉన్నాడని వీడియో పేర్కొంది."ఇటువంటి చెడు ప్రవర్తనలను బహిర్గతం చేసిన సోషల్ మీడియా పోస్టుల పట్ల అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. చర్యను తీసుకోవడం పట్ల రాయల్ ఒమాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని సలీమ్ ఖలాఫ్ అనేఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారుడు చెప్పారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









