షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- June 12, 2026
షార్జా: షార్జాలో హత్యకు గురైన ఒక భారతీయుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు ఈ కేసును పర్యవేక్షిస్తున్న యాబ్ లీగల్ సర్వీసెస్ (Yab Legal Services) సీఈఓ సలామ్ పాప్పినీస్సేరి చెప్పారు. షార్జా ఫోరెన్సిక్ విభాగం మసీదులో 'అసర్' ప్రార్థనల తర్వాత ఆయన అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయన్నారు. ఆయన మృతదేహాన్ని రాత్రి 10:40 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో తరలించినట్లు తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కన్నూర్లో ఉన్న ఆయన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లే సమయంలో ఆయన సోదరుడు కూడా తోడుగా ఉన్నాడని తెలిపారు.
సోషల్ మీడియా వీడియో విషయంలో జరిగిన వివాదంలో 40 ఏళ్ల భారతీయుడు హత్యకు గురయ్యాడు. మరణించిన వ్యక్తి టిక్టాక్ లైవ్ సెషన్లో అనుమానితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అనుమానితుడు బాధితుడిని షార్జాలో కలువమని సవాలు విసిరి, రాగానే హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఆన్లైన్ శత్రుత్వం ఉన్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని వేగవంతంగా భారత్ కు తరలించేందుకు సహాయపడిన వారందరికి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్ కృషిని సలామ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







