షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- June 12, 2026
షార్జా: షార్జాలో హత్యకు గురైన ఒక భారతీయుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు ఈ కేసును పర్యవేక్షిస్తున్న యాబ్ లీగల్ సర్వీసెస్ (Yab Legal Services) సీఈఓ సలామ్ పాప్పినీస్సేరి చెప్పారు. షార్జా ఫోరెన్సిక్ విభాగం మసీదులో 'అసర్' ప్రార్థనల తర్వాత ఆయన అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయన్నారు. ఆయన మృతదేహాన్ని రాత్రి 10:40 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో తరలించినట్లు తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కన్నూర్లో ఉన్న ఆయన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లే సమయంలో ఆయన సోదరుడు కూడా తోడుగా ఉన్నాడని తెలిపారు.
సోషల్ మీడియా వీడియో విషయంలో జరిగిన వివాదంలో 40 ఏళ్ల భారతీయుడు హత్యకు గురయ్యాడు. మరణించిన వ్యక్తి టిక్టాక్ లైవ్ సెషన్లో అనుమానితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అనుమానితుడు బాధితుడిని షార్జాలో కలువమని సవాలు విసిరి, రాగానే హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఆన్లైన్ శత్రుత్వం ఉన్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని వేగవంతంగా భారత్ కు తరలించేందుకు సహాయపడిన వారందరికి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్ కృషిని సలామ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC
- అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!
- షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈలో ఆగస్టు 3 వరకు వర్షాలు..!!
- ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫోటోగ్రఫీ పోటీ.. ఆగస్టు 8 వరకు దరఖాస్తులకు అవకాశం
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు







