ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్
- June 13, 2017
గూర్ఖా జన్ముక్తి మోర్చా సభ్యులు ఉద్యమం ఉదృతం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనతో పాటు.. బెంగాలీ ఆధిపత్యం ప్రశ్నిస్తూ జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అటు ప్రభుత్వ కార్యాలయాలను బలవంతంగా మూయించారన్న ఆరోపణలతో ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా చేశారు. దీంతో ఉద్యమకారులు మరింత రెచ్చిపోతున్నారు. అటు నిరవధిక ఆందోళనలతో డార్జిలింగ్ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. హోటల్స్, రవాణా సంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు కూడా విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రభుత్వం వేతనాల్లో కోతలు విధిస్తామని తప్పక హాజరుకావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









