ఇజ్రాయిల్లో ఐఎస్ ఉగ్రవాదల తొలి దాడి
- June 16, 2017 తమ అరాచక చర్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. తాజాగా మరోదాడికి పాల్పడింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంలోని ఓల్డ్సిటీ శివారులో ఓ మహిళా పోలీస్ అధికారిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అనంతరం ముష్కరులను పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఈ దాడి గురించి ఐఎస్ ఆన్లైన్లో పోస్టుచేసింది. ‘యూధులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో ఓ మహిళా పోలీస్ను కత్తితో పొడిచి హతమార్చాం’ అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే ఇది చివరి దాడి కాదని.. ఇంకా ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటామని ఐఎస్ పేర్కొంది. కాగా.. ఇజ్రాయిల్లో ఐఎస్ దాడికి పాల్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జెరూసలెంలోని అల్ ఆఖ్సా మసీదు సమీపంలో శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు ఆగంతకులు పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు కాల్పులకు పాల్పడగా.. మూడో వ్యక్తి హదస్ మల్కా అనే మహిళా పోలీసును కత్తులతో పొడిచాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడి ముగ్గురు దుండగులను మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన హదస్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఐఎస్ ఉగ్రవాదులు కాదని, పాలస్తీనాకు చెందిన సున్నీ-ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హమస్ చెబుతోంది. స్థానిక తిరుగుబాటు దారులో కాల్పులకు పాల్పడినట్లు హమస్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ