భారతీయులు ప్రాణాలతో ఉన్నారని మహ్మూద్ అబ్బాస్ ప్రణబ్ముఖర్జీకి వెల్లడించారు
- October 13, 2015
ఇరాక్లో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన 38 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నారని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడితో రామల్లా నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాక్లో కనిపించకుండా పోయిన 38 మంది భారత జాలర్ల గురించి కూడా చర్చించారు.ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని చెప్పారని.. కాని ఈ విషయాన్ని బలపరిచే విధంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని పాలస్తీనాలో భారత అధికార ప్రతినిధి వెల్లడించారు. కనిపించకుండా పోయిన భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బంధించి ఉంటారన్న వూహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







