కొత్త సినీ నిర్మాణ సంస్థలను స్థాపించబోతున్న-చరణ్
- October 13, 2015
త్వరలో రెండు కొత్త సినీ నిర్మాణ సంస్థలను స్థాపించబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. 'కొణిదెల ప్రొడక్షన్స్', 'వైట్ హార్స్ ఎంటర్టెన్మెంట్స్' పేరుతో ఇవి ఉంటాయని, నిర్మాతగా తన తొలి సినిమా తన తండ్రి చిరంజీవితో 150వ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విషయం ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. ఇటీవలే సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి వెళ్లి బాబాయ్ ని కలిసాను. ఇద్దరం కలిసి పని చేసే విషయాలను చర్చించాం. బాబాయ్ నిర్మించే సినిమాలో వచ్చే ఏడాది నటిస్తాను అని తెలిపారు. రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమా అక్టోబర్ 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబాయ్ ని సినిమా చూడటానికి ఆహ్వానించడానికే రామ్ చరణ్ వెళ్లినట్లు కూడా చెబుతున్నారు. కారణం ఏమైతేనేం... పవన్, రామ్ చరణ్ కలుసుకోవడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా విషయానికొస్తే ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో 'బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో 'బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది. రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్చరణ్, రకుల్ప్రీత్లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







