ఆప్ఘనిస్తాన్‌ లో ఉగ్రదాడి, 22మంది దుర్మరణం

- June 22, 2017 , by Maagulf
ఆప్ఘనిస్తాన్‌ లో ఉగ్రదాడి, 22మంది దుర్మరణం

హెల్మండ్‌: ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. హెల్మండ్‌లో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. హెల్మండ్‌లోని న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు లష్కర్‌ బాగ్‌లోని కాబూల్ బ్యాంక్ ఎదుట ఆత్మాహుతి దాడి చేశారు. ఒక్క సారిగా ఆ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ దుర్ఘటనలో రెండు డజన్ల మంది మృతి చెందగా పదుల మంది గాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com