'జవాన్' ఫస్ట్ లుక్ విడుదల
- June 22, 2017
సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. మరోవైపు.. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్తో సాయిధరమ్ మూవీ ఉండబోతోందట.
సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'జవాన్'. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత బివిఎస్ఎన్ రవి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు పాటలు యాక్షన్ సీక్వెన్స్ మినహా చిత్రీకరణ పూర్తయింది. జూన్ 23 నుంచి హైదరాబాద్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. జులై నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22న దర్శకుడు బివిఎస్ రవి బర్త్ డే సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
'తిక్క, విన్నర్' వంటి రెండు భారీ పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సాయిధరమ్ కెరీర్కు 'జవాన్' సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. సాయిధరమ్ నెక్స్ట్ మూవీ వినాయక్తో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో 'ఖైదీ నంబర్-150' తర్వాత స్టార్ హీరోస్తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడు వినాయక్. అయితే. ఎవరి ప్రాజెక్ట్స్లో వారు బిజీ అవడంతో.. ఇప్పుడప్పుడే వారి డేట్స్ దొరికేలా లేవు. ఈ లోపు.. సాయిధరమ్ వంటి యంగ్ హీరోతో వినాయక్ ఓ యాక్షన్ మూవీకి ప్లాన్ చేశాడట. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్తో సినిమా కావడంతో సాయిధరమ్ కూడా ఇందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరి.. మెగాస్టార్కు రెండు భారీ విజయాలు ఇచ్చిన వినాయక్.. ఇప్పుడు మేనల్లుడితోనూ ఓ సూపర్ హిట్ తెరకెక్కిస్తాడేమో చూడాలి..!
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు









