డబుల్ కా మీఠా
- June 24, 2017కావలసిన పదార్థాలు
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8
పాలు - 1 కప్పు
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు
మీగడ - 3 టేబుల్ స్పూన్లు
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి.
మరో గిన్నెలో పంచదార, రెండు టే.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి.
బ్రెడ్ స్లయిసె్సల అంచులు కట్ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.
పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి.
వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి.
తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.
10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది.
అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ