డబుల్ కా మీఠా
- June 24, 2017
కావలసిన పదార్థాలు
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8
పాలు - 1 కప్పు
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు
మీగడ - 3 టేబుల్ స్పూన్లు
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి.
మరో గిన్నెలో పంచదార, రెండు టే.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి.
బ్రెడ్ స్లయిసె్సల అంచులు కట్ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.
పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి.
వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి.
తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.
10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది.
అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









