మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి
- October 14, 2015
నెలవంక కనిపించడంతో మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం ఆషూర్ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టిస్తారు. ఈ నెల 24వ తేదీన మొహర్రం బీబీకా అలావా నుంచి బీబీకా ఆలంను ఏనుగు ఆంబారీపై ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ మేరకు నగరంలోని ఆషూర్ఖానాల్లో యుద్ధ్దప్రాదిపతిక పనులు పూర్తి చేశారు. ఆషుర్ఖానాల నిర్వహణకు రూ. 12 లక్షలు.. ఈ ఏడాది మొహర్రం సంతాప దినాల్లో భాగంగా నగరంలోని దాదాపు 161 ఆషుర్ఖానాలు, అంజుమన్ల నిర్వహణ, నీటి సరఫరా కోసం రూ. 12 లక్షలు విడుదల చేసినట్లు బుధవారం నాంపల్లి హజ్ హౌస్లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్ఫ్బోర్డు సీఈఓ అసదుల్లా చెప్పారు. ఏటా మొహర్రం నెలలోని మొదటి 19 రోజులు ముస్లింలు సంతాప దినాలుగా పాటించి, ఆషూర్ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టించి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. ఆషూర్ఖానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మొహర్రం ఏర్పాట్లపై సమీక్షించి, తమ సిబ్బందికి బాధ్యతలు ఇచ్చారన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









