మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి
- October 14, 2015
నెలవంక కనిపించడంతో మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం ఆషూర్ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టిస్తారు. ఈ నెల 24వ తేదీన మొహర్రం బీబీకా అలావా నుంచి బీబీకా ఆలంను ఏనుగు ఆంబారీపై ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ మేరకు నగరంలోని ఆషూర్ఖానాల్లో యుద్ధ్దప్రాదిపతిక పనులు పూర్తి చేశారు. ఆషుర్ఖానాల నిర్వహణకు రూ. 12 లక్షలు.. ఈ ఏడాది మొహర్రం సంతాప దినాల్లో భాగంగా నగరంలోని దాదాపు 161 ఆషుర్ఖానాలు, అంజుమన్ల నిర్వహణ, నీటి సరఫరా కోసం రూ. 12 లక్షలు విడుదల చేసినట్లు బుధవారం నాంపల్లి హజ్ హౌస్లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్ఫ్బోర్డు సీఈఓ అసదుల్లా చెప్పారు. ఏటా మొహర్రం నెలలోని మొదటి 19 రోజులు ముస్లింలు సంతాప దినాలుగా పాటించి, ఆషూర్ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టించి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. ఆషూర్ఖానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మొహర్రం ఏర్పాట్లపై సమీక్షించి, తమ సిబ్బందికి బాధ్యతలు ఇచ్చారన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









