జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది

- June 29, 2017 , by Maagulf
జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది

రేపు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్ది సేపటి కిందట భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగాజులై 1 నుంచి జీఎస్టీ అమలులోనికి రానున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు అర్ధరాత్రి జీఎస్టీ ఆరంభ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కానున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిథి సత్యవ్రత్ చతుర్వేది విలేకరులతో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com