వాఫీ మాల్ దోపిడీ ఘటనలో నిందితుడి అరెస్ట్
- October 16, 2015
యూ. ఏ. ఈ. లో ఎనిమిది సంవత్సరాల క్రితం సంచలనాత్మకమైన 14.7 మిలియన్ దీనార్ల వాఫీ మాల్ దోపిడీ కేసులో నిందితులైన 'పింక్ పాంధర్' ముఠా యొక్క నాలుగవ నిందితుడిని అరెస్టు చేసినట్టు ఉప ప్రధాని మరియు ఆంతరంగిక శాఖ మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ మరియు దుబాయి పోలీసు వారు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు కార్లలో వచ్చి వాఫీ మాల్ గాజు అద్దాలనుండి దూసుకుపోయి, ఆభరణాల దుఖాన్ని దోచుకుపోయిన సంగతి పాఠకులకు తెలిసే ఉండవచ్చు. ఈ ఘటనలో ఇద్దరు సెర్బియన్ జాతీయులను అరెస్టుచేయగా, మూడవ వ్యక్తిని యూ. ఏ. ఈ. కి అప్పగించారు. గత సంవత్సరం మరో నిందితుడు స్పెయిన్ లో పట్టుబడడంతో, యూరోప్ వ్యాప్తంగా ఆ ముఠాకు చెందిన 50 మంది సభ్యులు అరెస్టు అయినట్టయిoది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







