సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యకు విడాకులు మంజూరు
- July 04, 2017
సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు చోటు చేసుకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ ల బంధం కు తెరపడింది. ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ లకు ఏడేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ళ కొడుకు ఉన్నాడు.. గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య వివాదాలు ఏర్పడడంతో.. విడిగా ఉంటూ.. విడాకుల కోసం 2016 డిసెంబర్ లో చెన్నై ఫ్యామిలీ కోర్టు గడప ఎక్కారు. న్యాయస్థానం ఈ దంపతులకు ఆరునెలల గడువు ఇచ్చింది.. తాజాగా ఆరునెలల గడువు పూర్తి అవ్వడంతో... తమకు విడిపోవడం ఇష్టమని సొందర్య, అశ్విన్ లు కోర్టుకు వెల్లడించారు. దీంతో ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది.. కాగా కొడుకు వేద్ తల్లి సౌందర్య వద్ద ఉండేటట్లు ఒప్పందం జరిగింది.. కాగా సౌందర్య దర్శకత్వం వహించిన ధనుష్ వీఐపీ 2 త్వరలో రిలీజ్ కానున్నది.. ట్రైలర్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







