సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యకు విడాకులు మంజూరు
- July 04, 2017
సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు చోటు చేసుకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ ల బంధం కు తెరపడింది. ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ లకు ఏడేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ళ కొడుకు ఉన్నాడు.. గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య వివాదాలు ఏర్పడడంతో.. విడిగా ఉంటూ.. విడాకుల కోసం 2016 డిసెంబర్ లో చెన్నై ఫ్యామిలీ కోర్టు గడప ఎక్కారు. న్యాయస్థానం ఈ దంపతులకు ఆరునెలల గడువు ఇచ్చింది.. తాజాగా ఆరునెలల గడువు పూర్తి అవ్వడంతో... తమకు విడిపోవడం ఇష్టమని సొందర్య, అశ్విన్ లు కోర్టుకు వెల్లడించారు. దీంతో ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది.. కాగా కొడుకు వేద్ తల్లి సౌందర్య వద్ద ఉండేటట్లు ఒప్పందం జరిగింది.. కాగా సౌందర్య దర్శకత్వం వహించిన ధనుష్ వీఐపీ 2 త్వరలో రిలీజ్ కానున్నది.. ట్రైలర్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







