'జై' రికార్డులు బద్దలు కొడుతోంది
- July 07, 2017
ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా జంటగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ 'జై లవకుశ'. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. టీజర్ లో జై రోల్ కు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు జై జైలు కొడుతున్నారు. ఎక్కడ చూసిన ఈ టీజర్ గురించి , ఎన్టీఆర్ నటన గురించి గొప్పగా చెపుతున్నారు.
అంతే కాదు టీజర్ విడుదలైన తొలి 100 నిమిషాల్లోనే లక్ష లైక్లు వచ్చాయంటే టీజర్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్లో 4 లక్షలకు పైగా వ్యూస్, ఐదు లక్షల డిజిటల్ వ్యూస్తో రికార్డ్ సృష్టించినట్లు చిత్రబృందం సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ టాలీవుడ్లో రికార్డ్ సృష్టించింది అంటూ పోస్టర్ షేర్ చేసారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'జై', 'లవ', 'కుశ' అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. నిన్న జై కు సంబదించిన టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మిగతా రెండు రోల్స్ కు సంబదించిన టీజర్లు కూడా రిలీజ్ చేస్తారట. దసరా పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని సెప్టెంబర్21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు









