ఆలస్యం ఖరీదు 1బిలియన్ డాలర్ల నష్టం..
- July 07, 2017
పారిస్ : ఎయిర్బస్కు చెందిన జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన నాలుగు ఆర్డర్లను ఖతార్ ఎయిర్లైన్స్ వెనక్కి తీసుకుంది. డెలివరీలో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఆర్డర్లను వెనక్కితీసుకోవడంతో 'ఎయిర్బస్' సంస్థకు దాదాపు 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుంది.
ఖతార్ విమానయాన సంస్థ నాలుగు ఏ350 జెట్ విమానాల కోసం గతంలో ఎయిర్బస్కు ఆర్డర్లు ఇచ్చింది. 'నాలుగు జెట్ విమానాల కోసం మేమిచ్చిన ఆర్డర్లను త్వరగా డెలివరీ చేయాలని కోరాం. అయితే డెలివరీలో ఆలస్యమైంది. ఎలాంటి ఆలస్యానికైనా ఎయిర్బస్ సంస్థనే బాధ్యతవహించాలని మేం గతంలోనే చెప్పాం' అని ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్బకార్ తెలిపారు. పలు సమస్యల కారణంగా వీటి డెలివరీలో ఆలస్యమైనట్లు ఎయిర్బస్ ప్రతినిధి తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ నాలుగు జెట్ విమానాలను తిరిగి అమ్మాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









