శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- February 26, 2026
టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. సూపర్-8 పోరులో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంక 61 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ వరుసగా రెండో ఓటమితో లంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31), వెల్లలాగే (29) మినహా మిగతా వారెవరూ కనీసం పోరాట పటిమ కనబరచలేదు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, మ్యాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సఫలమైంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించిన కివీస్, లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి సెమీస్ దిశగా అడుగులు వేసింది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









