శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- February 26, 2026
టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. సూపర్-8 పోరులో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంక 61 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ వరుసగా రెండో ఓటమితో లంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31), వెల్లలాగే (29) మినహా మిగతా వారెవరూ కనీసం పోరాట పటిమ కనబరచలేదు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, మ్యాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సఫలమైంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించిన కివీస్, లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి సెమీస్ దిశగా అడుగులు వేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









