న్యూ బోర్న్స్‌కి సైతం రుసుము తప్పదు

- July 08, 2017 , by Maagulf
న్యూ బోర్న్స్‌కి సైతం రుసుము తప్పదు

జెడ్డా: పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌లో మార్పులు చేశామనీ, ప్రైవేట్‌ సెక్టార్‌, నాన్‌ సౌదీ రెసిడెంట్స్‌ తమ డిపెండెంట్స్‌కి సంబంధించి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన కొత్త వివరాలు అందులో పొందు పర్చామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఫీజులో న్యూ బోర్న్స్‌ని కూడా చేర్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 2017కి సంబంధించి ఈ ఫీజు 100 సౌదీ రియాల్స్‌ కాగా, 2018కి 200, 2019కి 300, 2020కి 400 సౌదీ రియాల్స్‌ ఫీజుని పేర్కొన్నారు. జులై 1 నుంచి ఈ ఫీజు అమల్లోకి వచ్చింది. రెసిడెన్నీ పర్మిట్‌ రెన్యువల్‌కి ముందు లేదా, ఎగ్జిట్‌ రీ-ఎంట్రీ వీసా సందర్భంగా ఈ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com