సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ను కైవసం చేసుకున్న హరీందర్
- July 08, 2017
భారత స్క్వాష్ క్రీడాకారుడు హరీందర్ పాల్ సంధు సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా నిర్వహించిన ఫైనల్లో హరీందర్... ఆస్ట్రేలియా క్రీడాకారుడు రిస్ డౌలింగ్పై 11-8, 12-10, 11-4తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్లో ఒకానొక దశంలో 1-7తో వెనుకబడి ఉన్న హరీందర్ ఆ తర్వాత పుంజుకుని 11-8తో కైవసం చేసుకున్నాడు. హోరా హోరీగా జరిగిన రెండో గేమ్ని 12-10తో గెలుచుకున్న హరీందర్ మూడో గేమ్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్ అనంతరం హరీందర్ మాట్లాడుతూ.. 'చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య ఆడటంతో ఈ వారం చాలా కష్టంగా గడిచింది. గతంలోనూ ఎన్నోసార్లు ఆస్ట్రేలియాలో టోర్నమెంట్లు ఆడాను. మొదటిసారి ఇక్కడ పీఎస్ఏ టోర్నమెంట్ గెలవడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నా' అని తెలిపాడు. మొత్తంగా హరీందర్కి ఇది 8వ పీఎస్ఏ టైటిల్ కాగా ఈ సీజన్లో ఇది మూడోది. మేలో మలేసియాలో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







