తీవ్రవాద నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై విచారణ
- July 13, 2017
మనామా: తీవ్రవాద నేరాలకు పాల్పడిన ఇరువురు నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై నమోదైన కేసు విచారణను హై క్రిమినల్ కోర్ట్ బుధవారం ప్రారంభించారు, వీరిలో ఒక తీవ్రవాదికి జీవిత ఖైదు విధించబడింది. కాగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి తూర్పు అకేర్లోని తన ఇంట్లో ఆ తీవ్రవాద జంటను దాచిపెట్టినట్లు పోలీసులు ఒక సమాచారం అందుకున్న తరువాత ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ తనిఖీలో తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి సహా పట్టుబడ్డాడు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతివాది తీవ్రవాదులకు రవాణా సేవలను సైతం అందించి సహకరించినట్లు పేర్కొన్నారు. ఆ ఇరువురు తీవ్రవాదులు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించటానికి దోహదపడింది. " మా ఇంటి దగ్గర నేను బైట కూర్చున్నప్పుడు ఓ కారు నా దగ్గరికి వచ్చి, మాకు వసతి కల్పించమని అడిగారు" అని ఆ వ్యక్తి న్యాయవాదులతో చెప్పాడు. "నా భార్య ఇంట్లో లేనందున, నేను అంగీకరించానని పేర్కొన్నాడు . కోర్టు రికార్డుల ప్రకారం, జీవిత ఖైదు విధించబడిన తీవ్రవాదులతో ఒకరిని "బాక్టీరియా" అని మారుపేరుతో పిలుస్తారు. 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి కేసును అక్టోబర్ 5 వ తేదీన విచారణ కోసం వాయిదా వేశారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









