తీవ్రవాద నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై విచారణ
- July 13, 2017
మనామా: తీవ్రవాద నేరాలకు పాల్పడిన ఇరువురు నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై నమోదైన కేసు విచారణను హై క్రిమినల్ కోర్ట్ బుధవారం ప్రారంభించారు, వీరిలో ఒక తీవ్రవాదికి జీవిత ఖైదు విధించబడింది. కాగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి తూర్పు అకేర్లోని తన ఇంట్లో ఆ తీవ్రవాద జంటను దాచిపెట్టినట్లు పోలీసులు ఒక సమాచారం అందుకున్న తరువాత ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ తనిఖీలో తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి సహా పట్టుబడ్డాడు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతివాది తీవ్రవాదులకు రవాణా సేవలను సైతం అందించి సహకరించినట్లు పేర్కొన్నారు. ఆ ఇరువురు తీవ్రవాదులు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించటానికి దోహదపడింది. " మా ఇంటి దగ్గర నేను బైట కూర్చున్నప్పుడు ఓ కారు నా దగ్గరికి వచ్చి, మాకు వసతి కల్పించమని అడిగారు" అని ఆ వ్యక్తి న్యాయవాదులతో చెప్పాడు. "నా భార్య ఇంట్లో లేనందున, నేను అంగీకరించానని పేర్కొన్నాడు . కోర్టు రికార్డుల ప్రకారం, జీవిత ఖైదు విధించబడిన తీవ్రవాదులతో ఒకరిని "బాక్టీరియా" అని మారుపేరుతో పిలుస్తారు. 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి కేసును అక్టోబర్ 5 వ తేదీన విచారణ కోసం వాయిదా వేశారు.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









