తీవ్రవాద నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై విచారణ
- July 13, 2017
మనామా: తీవ్రవాద నేరాలకు పాల్పడిన ఇరువురు నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై నమోదైన కేసు విచారణను హై క్రిమినల్ కోర్ట్ బుధవారం ప్రారంభించారు, వీరిలో ఒక తీవ్రవాదికి జీవిత ఖైదు విధించబడింది. కాగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి తూర్పు అకేర్లోని తన ఇంట్లో ఆ తీవ్రవాద జంటను దాచిపెట్టినట్లు పోలీసులు ఒక సమాచారం అందుకున్న తరువాత ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ తనిఖీలో తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి సహా పట్టుబడ్డాడు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతివాది తీవ్రవాదులకు రవాణా సేవలను సైతం అందించి సహకరించినట్లు పేర్కొన్నారు. ఆ ఇరువురు తీవ్రవాదులు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించటానికి దోహదపడింది. " మా ఇంటి దగ్గర నేను బైట కూర్చున్నప్పుడు ఓ కారు నా దగ్గరికి వచ్చి, మాకు వసతి కల్పించమని అడిగారు" అని ఆ వ్యక్తి న్యాయవాదులతో చెప్పాడు. "నా భార్య ఇంట్లో లేనందున, నేను అంగీకరించానని పేర్కొన్నాడు . కోర్టు రికార్డుల ప్రకారం, జీవిత ఖైదు విధించబడిన తీవ్రవాదులతో ఒకరిని "బాక్టీరియా" అని మారుపేరుతో పిలుస్తారు. 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి కేసును అక్టోబర్ 5 వ తేదీన విచారణ కోసం వాయిదా వేశారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







