కామెరూన్లో ఆత్మాహుతి దాడి
- July 13, 2017
యవోండే(కామెరూన్): ఆఫ్రికా దేశం కామెరూన్లో తీవ్ర వాద సంస్థ బోకోహరామ్ దాడులకు తెగబడింది. నైజీరియా సరిహద్దు పట్టణమైన వజాలోని రద్దీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన నేపథ్యంలో పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. తీవ్రవాద సంస్థ బోకోహరామ్ మూలాలు ప్రధానంగా నైజీరియాలోనే ఉన్నప్పటికీ సరిహద్దుల్లో ఉన్న చాడ్, కామెరూన్, నైగర్ దేశాల్లో కూడా ఇటీవల ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. ఈ ఘటనలకు భీతిల్లిన కామెరూన్ వాసులు దాదాపు రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్లారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద









