ఏ.ఆర్ రెహమాన్ ప్రదర్శన.. ఫ్యాన్స్ నిరాశ
- July 14, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏ.ఆర్ రెహమాన్ పాటలంటే ఇష్టపడని వారుండరు. టాలీవుడ్నుంచి హాలీవుడ్ దాకా రెహమాన్ సంగీతంలో ఉన్న మాధుర్యం అందరూ రుచిచూశారు. అలాంటి రెహమాన్ తన కచేరీతో అభిమానులను నిరాశపరిచారట.
25 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా గతవారం రెహమాన్ లండన్లోని వెంబ్లీ స్టేడియంలో కచేరీ నిర్వహించారు. అయితే కచేరీలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడారట. దాంతో ఉత్తరాది భారతీయులు నిరాశచెందారట. అంతేకాదు కొందరు కార్యక్రమం పూర్తవకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు చిత్రవర్గాలు సోషల్మీడియాలో పేర్కొన్నాయి.
రెహమాన్ నుంచి ఇలాంటి తీరు అస్సలు వూహించలేదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు కచేరీ కోసం కొన్న టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రెహమాన్కి తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇందులో ఆయన తప్పేమీ లేదని మద్దతిస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







