ఏ.ఆర్ రెహమాన్ ప్రదర్శన.. ఫ్యాన్స్ నిరాశ
- July 14, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏ.ఆర్ రెహమాన్ పాటలంటే ఇష్టపడని వారుండరు. టాలీవుడ్నుంచి హాలీవుడ్ దాకా రెహమాన్ సంగీతంలో ఉన్న మాధుర్యం అందరూ రుచిచూశారు. అలాంటి రెహమాన్ తన కచేరీతో అభిమానులను నిరాశపరిచారట.
25 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా గతవారం రెహమాన్ లండన్లోని వెంబ్లీ స్టేడియంలో కచేరీ నిర్వహించారు. అయితే కచేరీలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడారట. దాంతో ఉత్తరాది భారతీయులు నిరాశచెందారట. అంతేకాదు కొందరు కార్యక్రమం పూర్తవకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు చిత్రవర్గాలు సోషల్మీడియాలో పేర్కొన్నాయి.
రెహమాన్ నుంచి ఇలాంటి తీరు అస్సలు వూహించలేదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు కచేరీ కోసం కొన్న టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రెహమాన్కి తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇందులో ఆయన తప్పేమీ లేదని మద్దతిస్తున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









