గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్ శంకుస్థాపన..!!
- October 19, 2015
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు . అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ టెర్మినల్ భవవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీని నిర్మాణం పూర్తయితే ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, స్థానిక టీడీపీ నేతలు హాజరు అయినారు . ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విమానాశ్రయం డైరెక్టరు ఎం.రాజకిశోర్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









