నాజర్ చేతిలో శరత్ కుమార్ పరాజయం
- October 19, 2015ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే సినీ నట సంఘాల ఎన్నికలు ఇటీవల సాధారణ ఎన్నికల్లానే మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న మా ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ప్యానల్, జయసుధ ప్యానల్ మధ్య అసెంబ్లీ ఎన్నికలను మించిన ఎత్తులు-పైఎత్తులు సాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ సేమ్ సీన్ రిపీటైంది. కొన్నిరోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ పై విశాల్ ప్యానల్ నాజర్ ను పోటీకి దింపడంతో వార్ ఆసక్తికరంగా తయారైంది. ఆ తరువాత ఒక ప్యానెల్ పై మరో ప్యానల్ ఆరోపణలతో సినీరాజకీయాలు వేడెక్కాయి. శరత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని విశాల్ టీమ్ ఆరోపణలు గుప్పించింది. అనూహ్యంగా తమిళ సినీ రాజకీయాల్లో అడుగుపెట్టి విశాల్ కొద్దికాలంలోనే అందరి మద్దతు సంపాదించగలిగాడు. అత్యంత రసవత్తరంగా.. సస్పెన్స్ గా జరిగిన ఈ ఎన్నికల్లో చివరకు శరత్ కుమార్ ప్యానెల్ పై విశాల్ ప్యానెల్ విజయం సాధించింది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నికయ్యారు. నాజర్ చేతిలో ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ ఓడిపోయాడు. నాజర్కు 1334 ఓట్లు,శరత్కుమార్కు 1231 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో రాధారవిపై విశాల్ ఘన విజయం సాధించాడు. విశాల్కు 1445 ఓట్లు, రాధారవికి 1138 ఓట్లు వచ్చాయి. పోలింగ్ సందర్భంగా కొద్దిపాటి హింస కూడా జరిగింది. విశాల్పై కొందరు దాడికి దిగడంతో ఆయన చేతికి గాయమైంది. పోలీసుల జోక్యంతో మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. విశాల్ తమిళ నటుడైనా అతడు మన తెలుగోడే.. ఆయన తండ్రి జీకె రెడ్డి అనేత తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్