రాజేంద్రప్రసాద్ కు షాక్ ఇచ్చినట్లు టాక్
- October 19, 2015
గత వారం రానా ఇంట్లో కొంత మంది యంగ్ హీరోలు హీరోయిన్స్ కలిసి లంచ్ సమయంలో చర్చించుకున్న విషయాలు 'మా' సంస్థ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ దృష్టి వరకు వెళ్ళడంతో రాజేంద్రుడు బన్నీ రానా లపై అసహనంగా ఉన్నట్లు టాక్. భారీ సినిమాలు ఒక దాని వెనుక మరొకటి రిలీజ్ అవుతూ ఉండటంతో ఈ భారీ సినిమాల మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్న విషయమై దృష్టి పెట్టి వీటి వల్ల నష్టపోతున్న దర్శక నిర్మాతలు నటీనటులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఏర్పాటు చేసిన ఈ లంచ్ మీట్ కు సంబంధించిన వార్తలు చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ లంచ్ మీట్ లో పాల్గొన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, నాని, సాయి ధర్మతేజ, నిఖిల్, సుశాంత్, తరుణ్, రకుల్ ప్రీత్, మంచులక్ష్మి లాంటి వారు అంతా ప్రస్తుత టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి 'మా' సంస్థ దగ్గరకు వెళ్లడంకన్నా ఇలాంటి లంచ్ మీటింగ్ లే బాగుంటాయని అని కామెంట్ చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు 'మా' సంస్థ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కు షాక్ ఇచ్చినట్లు టాక్. అంతేకాదు సినిమా సమస్యల పై ఎవరికీ వారు ఇలా చిన్నచిన్న పార్టీలు ఏర్పాటు చేసుకుని, ఎవరికీ వారు ఇలా కామెంట్లు చేసుకుంటే ఎలా అని రాజేంద్రప్రసాద్ అసహనం వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా గతవారం రానా ఇంట్లో కలుసుకున్న నటీనటులు అంతా ఇటువంటి లంచ్ సమావేశాలు మరిన్ని నిర్వహించుకుంటూ తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇటువంటి సమావేశాన్ని ఒక యంగ్ హీరో ఇంట్లో ఏర్పాటు చేసి ఆ సమావేశానికి మణిరత్నంతో పాటు దీపిక పదుకొనె లను అతిధులుగా పిలవడానికి నిశ్చయించుకున్నట్లు టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే 'మా' సంస్థకు పోటీగా మరో సంస్థ ఏర్పడబోతోందా ? అన్న సందేహం కలుగుతోందని కామెంట్స్ వినపడుతున్నాయి..
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







