గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్ శంకుస్థాపన..!!
- October 19, 2015
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు . అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ టెర్మినల్ భవవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీని నిర్మాణం పూర్తయితే ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, స్థానిక టీడీపీ నేతలు హాజరు అయినారు . ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విమానాశ్రయం డైరెక్టరు ఎం.రాజకిశోర్ చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









