గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్ శంకుస్థాపన..!!
- October 19, 2015
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు . అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ టెర్మినల్ భవవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీని నిర్మాణం పూర్తయితే ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, స్థానిక టీడీపీ నేతలు హాజరు అయినారు . ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విమానాశ్రయం డైరెక్టరు ఎం.రాజకిశోర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







