గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్‌ శంకుస్థాపన..!!

- October 19, 2015 , by Maagulf
గన్నవరం విమానాశ్రయం లో నూతన టెర్మినల్‌ శంకుస్థాపన..!!

నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు . అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ టెర్మినల్‌ భవవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీని నిర్మాణం పూర్తయితే ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, స్థానిక టీడీపీ నేతలు హాజరు అయినారు . ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విమానాశ్రయం డైరెక్టరు ఎం.రాజకిశోర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com